ఇందిరా, రాజీవ్ హత్యలతో లాభపడింది ఎవరో మొదట చెప్పండి : బీజేపీ కౌంటర్

ABN , First Publish Date - 2020-02-14T22:41:11+05:30 IST

పుల్వామా దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది

ఇందిరా, రాజీవ్ హత్యలతో లాభపడింది ఎవరో మొదట చెప్పండి : బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ : పుల్వామా దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘రాహుల్ వ్యాఖ్యలు చాలా భయానకమైనవి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలతో లాభ పడిందెవరో మొదట కాంగ్రెస్ చెప్పాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ సూటిగా ప్రశ్నించారు. 'పుల్వామా దాడిలో వీరమరణం పొందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఈరోజు స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను మూడు ప్రశ్నలు అడగదలచుకున్నాను. 1. ఈదాడి నుంచి ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు. 2.దాడిపై జరిపిన దర్యాప్తులో ఏం తేలింది? 3.దాడికి దారితీసిన భద్రతా లోపంపై బీజేపీ ప్రభుత్వం ఎవరినైనా జవాబుదారిగా గుర్తించిందా?' అని రాహుల్ శుక్రవారం ట్వీట్ చేశారు.

Updated Date - 2020-02-14T22:41:11+05:30 IST