శ్మశాన వాటిక స్థల సేకరణపై సమావేశం
ABN , First Publish Date - 2021-01-21T05:23:29+05:30 IST
మండల కేంద్రంలోని గోదావరి నదీ తీరం లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణ నిమిత్తం గురువారం గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఖానాపూర్, జనవరి 20: మండల కేంద్రంలోని గోదావరి నదీ తీరం లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణ నిమిత్తం గురువారం గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి తీరం లో నిర్వహించే ఈ సమావేశానికి పట్టణంలోని ప్రజాప్రతినిధులు, అన్నీ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు హాజరవ్వాలని పేర్కొన్నారు.