ఏలూరు మేయర్ ఎంపికపై 30న భేటీ

ABN , First Publish Date - 2021-07-24T02:08:00+05:30 IST

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై ఈనెల 30 భేటీ జరుపాలని రాష్ట్ర ఎన్నికల

ఏలూరు మేయర్ ఎంపికపై 30న భేటీ

అమరావతి: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై ఈనెల 30 భేటీ జరుపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏలూరులో మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికకు ఈనెల 30న కార్పొరేటర్లు సమావేశం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ రోజు ఎన్నికయిన వార్డు మెంబర్లు, ఎక్స అఫీషియో మెంబర్లు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఈనెల 26లోగా నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలు జరిగిన 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75మున్సిపాలిటీలు నగర పంచాయితీల్లో సెకండ్ డిప్యూటీ మేయర్, సెకండ్ వైస్ ఛైర్మన్ల నియామకానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈనెల 30 న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సమావేశం జరుపాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె కన్నబాబు పత్రికా ప్రకటన విడుదల చేసారు. 

Updated Date - 2021-07-24T02:08:00+05:30 IST