PM Modi బర్త్ డే సందర్భంగా 17న మెగా రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2021-09-13T16:19:11+05:30 IST
ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న మెగా రక్తదాన..
హైదరాబాద్ సిటీ/బర్కత్పుర : ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవల్పమెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ టి. రామదాసప్పనాయుడు తెలిపారు. ఆదివారం బర్కత్పురలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు కాచిగూడ తుల్జా భవన్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ముద్రా సొసైటీ రూపొందించిన సహకార భారతం పుస్తకావిష్కరణ ఉంటుందని వివరించారు. ఈ సంవత్సరం 2 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్క్రాస్ సొసైటీకి అప్పగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తలపెట్టిన సహకార కృతజ్ఞత పాదయాత్రను అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.