పాఠశాల ప్రహరీ నిర్మాణంలో ఇరువర్గాల కొట్లాట
ABN , First Publish Date - 2020-09-19T11:09:20+05:30 IST
నారాయణప్పవలస ఎంపీయూపీ స్కూల్ ప్రహరీ నిర్మాణం ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వివాదంలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణ పనులు చేపట్ట
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 18: నారాయణప్పవలస ఎంపీయూపీ స్కూల్ ప్రహరీ నిర్మాణం ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వివాదంలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టడమే గొడవకు కారణంగా తెలిసింది. ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతున్న వ్యక్తులు, ఏఈ సుబ్రహ్మణ్యం కొత్తగా మార్కింగ్ ఇచ్చారు. దీంతో మరొక వర్గం అక్కడకు వెళ్లి పనులు ఆక్రమణదారులకు కలిసి వచ్చేలా చేస్తున్నారేంటని ప్రశ్నించారు. ఆక్రమణ గొడవ తేలకపోయినట్లయితే ఆ భాగంలో ప్రహరీ నిర్మాణం నిలిపివేసి, మిగతా భాగంలో పనులు చేసుకోవాలని కోరారు.
ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం వాదులాడుకుంటూ తోసుకు న్నారు. మహిళలు, పురుషులు అని తేడా లేకుండా కొట్లాటకు దిగారు. దీంతో గ్రామానికి చెందిన రెడ్డి కళావతి, వైస్ చైర్మన్ ఎల్లమ్మలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని నిర్మాణాన్ని నిలిపివేశారు. దర్యాప్తు అనంతరం అధికారుల అనుమతితో నిర్మాణం ప్రారంభించాలని వారు తెలిపారు.