మంత్రిని కలిసిన కార్యవర్గ సభ్యులు

ABN , First Publish Date - 2021-10-18T06:28:30+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ గొల్లపల్లి మండల శాఖ అధ్యక్షుడుగా నూతనంగా నియమితులైన మండల కేంద్రానికి చెందిన మ్యాదరి రమేష్‌, పలువురు కార్యవర్గ సభ్యులు హుజూరాబాద్‌ ఉప ఎన్ని కల ప్రచారంలో ఉన్న రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

మంత్రిని కలిసిన కార్యవర్గ సభ్యులు
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న మ్యాదరి రమేష్‌

గొల్లపల్లి, ఆక్టోబరు 17 : టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ గొల్లపల్లి మండల శాఖ అధ్యక్షుడుగా నూతనంగా నియమితులైన మండల కేంద్రానికి చెందిన మ్యాదరి రమేష్‌, పలువురు కార్యవర్గ సభ్యులు హుజూరాబాద్‌ ఉప ఎన్ని కల ప్రచారంలో ఉన్న రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలపగా, మంత్రి రమేష్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలో పేతా నికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆర్హులకు అందేలా చూడాలని మంత్రి దిశానిర్ధేశం చేశారు. ఎంపీపీ నక్క శంకరయ్య, మా ర్కెట్‌ డైరెక్టర్‌ కడమండ వెంకటి, మండల బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్‌, పట్టణ బీసీ సెల్‌ కార్యదర్శి లక్ష్మన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T06:28:30+05:30 IST