మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం
ABN , First Publish Date - 2021-10-23T05:02:43+05:30 IST
ప్రస్తుత ఆధునిక యుగంలో మానసిక రుగ్మతలతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నా రని, వాటి నుంచి రక్షించడానికి సైకాలజిస్టులు కృషి చేయాలని, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకుల పతి మొక్కా జగన్నాథరావు అన్నారు.
దివాన్చెరువు, అక్టోబరు 22: ప్రస్తుత ఆధునిక యుగంలో మానసిక రుగ్మతలతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నా రని, వాటి నుంచి రక్షించడానికి సైకాలజిస్టులు కృషి చేయాలని, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకుల పతి మొక్కా జగన్నాథరావు అన్నారు. నన్నయ వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంటర్ ఫర్ సైకాలజికల్ అసెస్మెంట్ అండ్ కౌన్సిలింగ్ను వీసీ శుక్రవారం ప్రారంభించారు. ఇందులో అందించే సేవలను వివరించారు. సైకాలజీ విద్యార్థులు నూతన అంశాలపై పరిశోధ నలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.టేకి, సెంటర్ ఇన్ఛార్జి పి.రాజశేఖర్, విభాగాధ్యాపకులు, డీన్ ఆచార్య పి.సురేష్వర్మ, ఈసీ సభ్యుడు బి.జగన్మోహనరెడ్డి, అధ్యాపకులు కేవీ స్వామి, సుంకర వెంకటేశ్వరరావు, స్పృహ అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు సుంకర నాగేంద్ర కిషోర్ పాల్గొన్నారు.