ఎంఈవో సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-06-01T10:25:59+05:30 IST

మండల విద్యాధికారిగా మద్దెల నారాయణ అందిం చిన సేవలు మరువలేనివని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) నాయకులు

ఎంఈవో సేవలు మరువలేనివి

జగిత్యాల అర్బన్‌, మే 31: మండల విద్యాధికారిగా మద్దెల నారాయణ అందిం చిన సేవలు మరువలేనివని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) నాయకులు అన్నారు. ఎంఈవోగా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆయనను తపస్‌ నాయకులు పట్టణంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అనీ, కానీ ఉ ద్యోగ జీవితంలో వారు అందించిన సేవలు అనిర్వచనీయం అన్నారు.


జగిత్యాల ప్రాంత ఉపాధ్యాయులకు ఏంఈవోగా అందించిన సేవలు మరువలేనివని అన్నా రు. తపస్‌ మండల పట్టణ నాయకులు బొమ్మకంటి శ్రీనివాస్‌, రాజేంధర్‌, రామ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు నరేంధర్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్‌, భోనగిరి దేవయ్య, రాష్ట్ర నాయకులు మహిపాల్‌రెడ్డి, ఎలిగేటి రాజేంద్రప్రసాద్‌, జిల్లా నాయకులు సంది శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్‌రావు, మల్లారెడ్డి, కొల్ముల శ్రీనివాస్‌, అనిల్‌రావు, గం గాధర్‌, వేణుగోపాల్‌, మూర్తి ఉన్నారు.

Updated Date - 2020-06-01T10:25:59+05:30 IST