ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలి
ABN , First Publish Date - 2021-05-07T03:45:11+05:30 IST
: సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందించేలా
వెంకటాచలం, మే 6 : సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందించేలా కృషి చేయాలని నియోజక వర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు కోరారు. మండలంలోని సర్వేపల్లిలోని జనసేన కార్యాలయంలో గురువారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని నియంత్రించ డంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నియోజక వర్గంలో రెండు క్వారంటైన్ కేంద్రాలను సత్వరమే ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయి హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి ఐసోలేషన్ కిట్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి వ్యక్తికి కావాల్సింది 5 కేజీల బియ్యం కాదని, నాణ్యమైన వైద్యం అత్యవసరమన్నారు. ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకొని ఆదిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని కనుపూరులో జనసేన మండల ప్రధాన కార్యదర్శి కాకి శివకుమార్ తన స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు.