దేశభక్తిని చాటిన నేతాజి నాటకం

ABN , First Publish Date - 2021-10-25T05:02:53+05:30 IST

స్థానిక ఎల్‌వీఆర్‌ సన్స క్లబ్‌ ప్రాంగణంలో కళావిపంచి, ఆరాధన ఆర్ట్స్‌ అకాడమి, కేఆర్‌కే ఈవెంట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు నాటకోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ప్రదర్శించిన నేతాజి చారిత్రక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దేశభక్తిని చాటిన నేతాజి నాటకం
కళాకారులను సన్మానిస్తున్న నిర్వాహకులు

గుంటూరు(సాంస్కృతికం), అక్టోబరు 24: స్థానిక ఎల్‌వీఆర్‌ సన్స క్లబ్‌ ప్రాంగణంలో కళావిపంచి, ఆరాధన ఆర్ట్స్‌ అకాడమి, కేఆర్‌కే ఈవెంట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు నాటకోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ప్రదర్శించిన నేతాజి చారిత్రక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో క్లబ్‌ కార్యదర్శి యాగంటి దుర్గారావు, కనగాల మహేశ్వరరావు, బి.రామారావు, మేకల మోహనరావు, కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్‌, బొప్పన నరసింహారావు, డి.తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొని రంగస్థల కళాకారులు ఎం.రాంబాబు, సొంటినేని హనుమంతరావు, మహేందర్‌, విద్వమ్‌లకు వైకె నాగేశ్వరరావు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని జీవీజీ శంకర్‌, జి.మల్లిఖార్జునరావు పర్యవేక్షించారు.

 

Updated Date - 2021-10-25T05:02:53+05:30 IST