వచ్చే మూడు కోస్తాలో పలు చోట్ల వర్షాలు
ABN , First Publish Date - 2021-05-10T12:07:58+05:30 IST
మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో
అమరావతి/విశాఖపట్నం: మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో ఆదివారం కోస్తాలో వర్షాలు కురిశాయి. వచ్చే 3 రోజుల్లో కోస్తా, సీమలో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఆదివారం కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోత వాతావరణం నెలకొంది. కర్నూలులో 40 డిగ్రీలు, అనంతపురంలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రత నమోదయింది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.