మెట్రో ప్రధాన కార్యాలయం బెజవాడలోనే!
ABN , First Publish Date - 2020-09-25T15:43:13+05:30 IST
ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం విజయవాడలోనే ఉంటుందని..
పనుల కోసమే విశాఖలో రీజనల్ ఆఫీసు
గందరగోళం ఉండకూడదనే పేరు మార్పు: ఎండీ రామకృష్ణారెడ్డి
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం విజయవాడలోనే ఉంటుందని ఏపీఎంఆర్సీ ఎండీ ఎన్వీ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రెండో ఆఫీసుగా మాత్రమే విశాఖలో రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బుధవారం విజయవాడ నుంచి విశాఖకు కార్యాలయ ఫర్నిచర్, ఫైల్స్, సామగ్రిని తరలించడంతో ‘మెట్రో తరలింపు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం వార్త ప్రచురి తమైన విషయం తెలిసిందే. దీనిపై ఏపీఎం ఆర్సీ ఎండీ ఎన్వీ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.
విశాఖలో ప్రస్తుతం మెట్రోకు సంబంధించిన పనులు ఉండటం వల్ల సిబ్బందిని పెంచామని, అక్కడి కార్యకలాపాల కోసమే ఆ ఆఫీసు పనిచేస్తుందని తెలిపారు. విజయవాడ తో పాటు విశాఖపట్నంలోనూ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉన్నప్పుడు అక్కడ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్గా ఉంటే గందరగోళంగా ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్గా పేరు మార్చాం, దీనివల్ల భవిష్యత్లో ఏ గందరగోళం ఉండదన్నారు.