HYD : నేటి నుంచే Metro సువర్ణ ఆఫర్‌

ABN , First Publish Date - 2021-10-18T14:25:21+05:30 IST

మెట్రో సువర్ణ ఆఫర్‌ - 2021 సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది...

HYD : నేటి నుంచే Metro సువర్ణ ఆఫర్‌

హైదరాబాద్‌ సిటీ : మెట్రో సువర్ణ ఆఫర్‌ - 2021 సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు ట్రిప్‌పా‌స్‌ను మెట్రోస్టేషన్లలో పొందొచ్చు. నిత్యం ప్రయాణించే మార్గానికి 20 ట్రిప్పుల ధరను ముందస్తుగానే చెల్లిస్తే.. మరో పది ట్రిప్పులను ఉచితంగా పొందొచ్చు. గ్రీన్‌ లైన్‌ (ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ - పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ల మధ్య) ప్రయాణానికి కేవలం రూ.15 టికెట్‌ ధర కూడా నేటి నుంచే అందుబాటులోకి రానుంది. ఈ సువర్ణ ఆఫర్‌-2021  వచ్చే ఏడాది జనవరి 15 వరకు మాత్రమే ఉంటుంది.


Updated Date - 2021-10-18T14:25:21+05:30 IST