‘హెక్టార్ ప్లస్’ను విడుదల చేసిన ఎంజీ మోటార్
ABN , First Publish Date - 2020-07-13T22:03:57+05:30 IST
ఆరు సీట్లు కలిగిన ఎస్యూవీ హెక్టార్ ప్లస్ను ఎంజీ మోటార్స్ ఇండియా సోమవారం విడుదల చేసింది
న్యూఢిల్లీ: ఆరు సీట్లు కలిగిన ఎస్యూవీ హెక్టార్ ప్లస్ను ఎంజీ మోటార్ ఇండియా సోమవారం విడుదల చేసింది. ధర 13.48 లక్షల నుంచి రూ.18.53 లక్షల మధ్య ఉంది. మిడ్ సైజ్ ఎస్యూవీ హెక్టార్, ఎలక్ట్రిక్ ఎస్యూవీ, జడ్ఎస్, ఈవీ తర్వాత హెక్టార్ ప్లస్ మూడో వాహనం కానుంది. నిజానికి ఈ సెగ్మెంట్లో వాహనాల విలువ రూ. 16.44. రూ.22.43 లక్షల మధ్య ఉంటుంది. అయితే, పరిచయ ధరలో భాగంగా ప్రస్తుత వాహనాల కంటే తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నట్టు ఎంజీ మోట్సార్ ఇండియా అధ్యక్షుడు రాజీవ్ చాబా తెలిపారు. భారత్లో తమ ప్రయాణం ఏడాది క్రితం తమ తొలి ఇంటర్నెట్ ఎస్యూవీ హెక్టార్తో ప్రారంభమైనట్టు చెప్పారు. అప్పుడు తాము ఈ ఏడాది మొదట్లో జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని పరిచయం చేసినట్టు చాబా పేర్కొన్నారు.