ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ వి.చంద్రశేఖర్
ABN , First Publish Date - 2021-05-16T06:06:41+05:30 IST
ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ వి.చంద్రశేఖర్
హన్మకొండ అర్బన్ మే 16 : ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ వలపదాసు చంద్రశేఖర్ నియామకమైనట్లు తెలిసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్రెడ్డి శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న డాక్టర్ నాగార్జునరెడ్డి 2020 ఆగస్టు 5 నుంచి విధులు నిర్వరిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఎంజీఎం ఆస్పత్రిలో మెరుగైన సేవల కోసం చంద్రశేఖర్ను నియమించినట్లు తెలిసింది. చంద్రశేఖర్ గతంలో కాకతీయ మెడికల్ ప్రిన్సిపాల్గా, కరోనా మొదటి వేవ్లో ఎంజీఎం కొవిడ్ ఇన్చార్జిగా, జనరల్ మెడిసిన్గా సమర్థవంతంగా విధులు నిర్వరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.