ఐపీఎల్కు మిచెల్ మార్ష్ దూరం?
ABN , First Publish Date - 2020-09-23T09:08:47+05:30 IST
తొలి మ్యాచ్లోనే ఓడిన బాధలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్కు మరో పెద్ద దెబ్బ తగిలింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గాయపడిన...
దుబాయ్: తొలి మ్యాచ్లోనే ఓడిన బాధలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్కు మరో పెద్ద దెబ్బ తగిలింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గాయపడిన ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మొత్తం ఐపీఎల్కే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అతడు బంతి వేసిన అనంతరం పిచ్పై జారి పడ్డాడు. ఈ క్రమంలో కాలి మడమ నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్ స్థానంలో డాన్ క్రిస్టియన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్రైజర్స్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.