‘మైక్రో లెవెల్‌ లోక్‌ అదాలత్‌ విజయవంతం’

ABN , First Publish Date - 2021-04-18T05:12:23+05:30 IST

లోక్‌ అదాలత్‌ భవనంలో శనివారం నిర్వహించిన మైక్రో లెవెల్‌ లోక్‌ అదాలత్‌ విజయవంతమైనట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.

‘మైక్రో లెవెల్‌ లోక్‌ అదాలత్‌ విజయవంతం’

కర్నూలు(లీగల్‌), ఏప్రిల్‌ 17: లోక్‌ అదాలత్‌ భవనంలో శనివారం నిర్వహించిన మైక్రో లెవెల్‌ లోక్‌ అదాలత్‌ విజయవంతమైనట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. క్రిమినల్‌ కేసులు, మోటార్‌ వాహనాల ప్రమాదాల కేసులు పరిష్కరించామన్నారు. బాధితులకు రూ.66,68,000 నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్సురెన్స్‌ కంపెనీలు అంగీక రించాయని అన్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి.భాస్కర్‌ రావు, న్యాయవా దులు పి.నిర్మల, బి.మురళీ మనోహర్‌, ఇన్సురెన్స్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:12:23+05:30 IST