సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-01-25T06:40:06+05:30 IST
సమస్యలు పరిష్కరించాలి
నూజివీడు టౌన్, జనవరి 24: పాఠశాల కార్మికులకు జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పశ్చిమ కృష్ణ కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, వంట ఏజెన్సీ హెల్పర్లు, పాఠశాల పారిశుధ్య కార్మికులు సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. వంట ఏజెన్సీ కార్మికులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం దారుణమని పుల్లారావు అన్నారు. కార్మిక చట్టాలను అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం వేతనం రూ.21 వేలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వేముల బక్కయ్య, ప్రగతీశీల మహిళా సంఘం అధ్యక్షురాలు తామాడ అరుణ, పరికల కళావతి, బిగూది ఆనందరావు, తనగాల మాలతి, విజయ, మేడ కామేశ్వరి, దాసు, బూతం మారయ్య పాల్గొన్నారు.