మధ్యాహ్న భోజనం మెరుగుకు చర్యలు

ABN , First Publish Date - 2020-12-04T06:52:00+05:30 IST

రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం మెరుగుకు చర్యలు తీసుకుంటున్న మిడ్‌ డే మీల్స్‌ రాష్ట్రశాఖ డైరెక్టర్‌ బి.ఎం. దివాన్‌ మైదీన్‌ పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజనం మెరుగుకు చర్యలు
జార్జికార్నేషన్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూస్తున్న డైరెక్టర్‌ దివాన్‌ మైదీన్‌

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 3 : రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం మెరుగుకు చర్యలు  తీసుకుంటామని మిడ్‌ డే మీల్స్‌ రాష్ట్రశాఖ డైరెక్టర్‌ బి.ఎం. దివాన్‌ మైదీన్‌ పేర్కొన్నారు. మచిలీపట్నం జార్జి కార్నేషన్‌ హైస్కూల్‌,  సుల్తానగరం మండల పరిషత్‌ యూపీ పాఠశాలను దివాన్‌ మైదీన్‌ సందర్శించారు. కుకింగ్‌ ఏజెన్సీలతో మాట్లాడారు. మచిలీపట్నం జార్జి కార్నేషన్‌ హైస్కూల్‌ విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. మెనూ సక్రమంగా అమలు జరకగపోతే చర్యలు తీసుకుం టామన్నారు.  మిడ్‌ డే మీల్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వేణు గోపాల్‌, బందరు డీవైఈవో యు.వి. సుబ్బారావు, ఎంఈవో దుర్గాప్రసాద్‌, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రమణ, ఎలిమెంటరీ పాఠశాల హెచ్‌ఎం  తిరుమల సుబ్బారావు, పి. కేశవరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T06:52:00+05:30 IST