వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపాలి

ABN , First Publish Date - 2020-04-09T09:59:02+05:30 IST

వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపాలి

వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపాలి

రాంనగర్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో  పనులు చేసుకొని జీవించే వలస కూలీలు, కార్మికులను లాక్‌డౌన్‌ సమయంలో వారి సొంత గ్రా మాలకు వెళ్లే వెసులుబాటు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు.  హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలలో వేలాది మంది వలస కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.  స్వగ్రామాలలో ఉన్న వారి  కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని, అనుమతిస్తే వారు అక్కడకు వెళ్లి కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉంటారని తెలిపారు.   

Updated Date - 2020-04-09T09:59:02+05:30 IST