కౌంటింగ్ కేంద్రంలోకి ఇలా వెళ్లాడని లాక్కెళ్లిన పోలీసులు..

ABN , First Publish Date - 2020-12-04T19:09:11+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగుతోంది.

కౌంటింగ్ కేంద్రంలోకి ఇలా వెళ్లాడని లాక్కెళ్లిన పోలీసులు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సెల్‌ఫోన్‌లను నిషేధించారు.అయితే యూసఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ఫోన్‌తో ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఎవరూ గుర్తించకుండా సెల్‌ఫోన్‌ను షూస్‌లో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే షరీఫుద్దీన్‌ను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు లాక్కొచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి ఆయన్ను తరలించారు.



Updated Date - 2020-12-04T19:09:11+05:30 IST