కష్ట కాలంలో కదిలిన మనసులు

ABN , First Publish Date - 2021-05-11T05:12:23+05:30 IST

కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల కారణంగా ఎందరో నిరుపేదలు పట్టెడన్నం కోసం తహతహలాడుతున్నారు.

కష్ట కాలంలో కదిలిన మనసులు
పాయకరావుపేటలో పేదలకు సరుకులు అందజేస్తున్న దళిత సంఘాల నాయకులు

  


పాయకరావుపేట/ఎస్‌.రాయవరం, మే 10: కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల కారణంగా ఎందరో నిరుపేదలు పట్టెడన్నం కోసం తహతహలాడుతున్నారు. అయినప్ప టికీ కడుపు నిండే మార్గం లేక చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు కొందరు దాతలు పెద్ద మనస్సుతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేశ్‌ సహకారంతో విశాఖ జిల్లా అధ్యక్షుడు బోడపాటి శ్రీను తదితరులు సోమవారం పాయకరావుపేటలో సుమారు వంద మంది పేదలకు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. గోపాలపట్నం శివారు పెద్దిరాజుపాలెం గ్రామానికి చెందిన కొర్ని నాని అనే యువకుడు  పలువురు అనాధలు, యాచకులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశాడు. అలాగే, ఎస్‌.రాయవరం మండలం సర్వసిద్ధి గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ఈరిగిల అప్పలకొండ (1986- 87)  టెన్త్‌ బ్యాచ్‌లో కొన్ని కుటుంబాల వారితో పాటు మరికొందరు పేదలకు సోమవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం, రెండు కిలోల  కందిపప్పు, వంట నూనె , పంచదార, చింతపండు, గోధమనూక, ఉల్లిపాయలు, శానిటైజర్లు, మాస్క్‌లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. 

Updated Date - 2021-05-11T05:12:23+05:30 IST