వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న మినీ బస్సు.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-05-21T20:16:37+05:30 IST
గుంటూరు: నగర శివారులోని ఓబుళనాయుడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ను మినీ బస్సు ఢీకొట్టింది.
గుంటూరు: నగర శివారులోని ఓబుళనాయుడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ను మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వాహనం దిగి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. గాయపడిన వ్యక్తికి జీజీహెచ్లో చికిత్సనందిస్తున్నారు. వలస కూలీలను తమిళనాడు నుంచి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో విడిచి వస్తుండగా ప్రమాదం జరిగింది.