మినీ స్టేడియం అందుబాటులోకి తేవాలి
ABN , First Publish Date - 2022-01-19T05:57:52+05:30 IST
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఫిబ్రవరి 15లోగా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
- ఫిబ్రవరి 15లోగా పనులు పూర్తి చేయాలి
- కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఫిబ్రవరి 15లోగా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మినీ స్టేడియం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 80 శాతం పనులు ప్తూర్తయినట్లుగా సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రూ.3 కోట్ల వ్యయంతో 4 ఎకరాల స్థలంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. వారం రోజుల్లోగా ఆర్చ్, సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయాలని, సూచికల బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, స్టేడియం పనులను పర్యవేక్షించాలని అన్నారు.