తుమ్మలను కలిసిన పువ్వాడ, నామా, మెచ్చా
ABN , First Publish Date - 2021-01-19T05:24:34+05:30 IST
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు ప్రజాప్రతినిధులు గండుగులపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
దమ్మపేట, జనవరి 18: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు ప్రజాప్రతినిధులు గండుగులపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య తుమ్మల నివాసానికి వెళ్లారు. దాదాపు అరగంటపాటు వివిధ అభివృద్ధి పనులు, ప్రసా సమస్యల పరిష్కారంపై చర్చించినట్టు తెలిసింది.