పోలవరం ముఖ్యమా? ..అమరావతి ముఖ్యమా?: మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-12-04T19:48:04+05:30 IST
ఏపీ శాసనమండలిలో రాజధాని అమరావతిపై చర్చజరగాలంటూ టీడీపీ సభ్యులు పట్టుపట్టారు.
అమరావతి: ఏపీ శాసనమండలిలో రాజధాని అమరావతిపై చర్చజరగాలంటూ టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. అధికారపార్టీ సభ్యులు పోలవరంపై చర్చజరపాలని కోరారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదన జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ముందు అమరావతిపై చర్చ జరుగుతుందని, తర్వాత పోలవరంపై చర్చిద్దామని అన్నారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం ముఖ్యమా?.. అమరావతి ముఖ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపై చర్చించకుండా.. కేవలం 28 గ్రామాలకు సంబంధించిన అంశంపై చర్చించడం ఏంటని నిలదీశారు.
పోలవరంపై నిన్ననే చర్చ పెడతామన్నారని, ఇవాళ కూడా జరుగుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందని మంత్రి అనిల్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బిల్లులను గందరగోళం మధ్య డిప్యూటీ ఛైర్మన్ పాస్ చేశారు.