మంత్రి అనిల్కుమార్ శ్రీశైలం పర్యటన రద్దు
ABN , First Publish Date - 2020-05-28T11:25:45+05:30 IST
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శ్రీశైలం పర్యటన రద్దయింది. బుధవారం ఆయన శ్రీశైలం బ్యాక్వాటర్ వద్ద
శ్రీశైలం, మే 27: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శ్రీశైలం పర్యటన రద్దయింది. బుధవారం ఆయన శ్రీశైలం బ్యాక్వాటర్ వద్ద కొలనువాగు ప్రాంతంలో నిర్మిస్తున్న వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దయినట్లు సమాచారం. కొలనువాగుకు శ్రీశైలం జలాశయం బ్యాక్వాటర్లో బోటులో వెళ్లాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.