పంద్రాగస్టుకు ముఖ్య అతిథిగా మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-08-14T09:52:12+05:30 IST
పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఈనెల 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ
కర్నూలు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఈనెల 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి జెండా ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు.
కరోనా నివారణకు రేయింబవళ్లు కష్ట పడుతున్న వైద్యులు, పోలీసులు, నర్సులు, మునిసిపల్ కార్మికుల్లో ఐదుగురికి సన్మానం చేస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్లో శకటాలను అయిదేసి చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ సేవలందించిన ఐదుగురికి ప్రశంసా పత్రాలు అందిస్తామని చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కర్నూలు, ఆగస్టు 13: పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప గురువారం పరిశీలించారు. అనంతరం రీహార్సల్స్ను పర్యవేక్షించారు. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, అడిషినల్ ఎస్పీ ఎస్ఈబీ గౌతమిసాలి, ఏఆర్ అడిషినల్ ఎస్పీ రాధాకృష్ణ, ఆర్డీవో వెంకటేశ్వర్లు, కర్నూలు తహసీల్దార్ వెంకటేశ్వర నాయక్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్వో పుల్లయ్య, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు.