వందలాది మందితో మంత్రి అప్పలరాజు సభ
ABN , First Publish Date - 2021-06-23T08:48:36+05:30 IST
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణంలో వందలాది మంది మహిళలతో మంత్రి సీదిరి అప్పలరాజు సభ నిర్వహించారు. మంగళవారం వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేసిన నేపథ్యంలో అధికారులు
పలాస, జూన్ 22: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణంలో వందలాది మంది మహిళలతో మంత్రి సీదిరి అప్పలరాజు సభ నిర్వహించారు. మంగళవారం వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేసిన నేపథ్యంలో అధికారులు ఆర్భాటంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది మహిళలను ఆ కార్యక్రమానికి తరలించారు. దీనికి మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు మరచి ఇలా భారీ సభ ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.