ఏయూలో కరోనా కట్టడిపై మంత్రి అవంతి సమీక్ష
ABN , First Publish Date - 2021-03-28T23:07:01+05:30 IST
ఏయూలో కరోనా కట్టడిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో కరోనా బారినపడ్డ
విశాఖ: ఏయూలో కరోనా కట్టడిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో కరోనా బారినపడ్డ 102 మందిని ఐసోలేషన్ చేశామని తెలిపారు. విద్యార్థులతో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. వ్యాక్సినేషన్పై అపోహలు వద్దని అవంతి శ్రీనివాస్ సూచించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొవిడ్ బారినపడిన విద్యార్థులను యూనివర్సిటీలోని వసతి గృహాల్లోనే వుంచి వైద్యం అందిస్తున్నారు. కాగా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన హాస్టళ్లలో వుంటున్న మిగిలిన విద్యార్థినీవిద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.