వైసీపీ నేత సుబ్బారావుపై మంత్రి అనుచరుల దాడి.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. వీడియో తీసి మరీ వార్నింగ్

ABN , First Publish Date - 2021-12-20T22:14:53+05:30 IST

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీల వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.

వైసీపీ నేత సుబ్బారావుపై మంత్రి అనుచరుల దాడి.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. వీడియో తీసి మరీ వార్నింగ్

ఒంగోలు: కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాస్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. తన వ్యాఖ్యలు కలకలం రేపడంతో ప్రాణభయంతో ఓ లాడ్జిలో తలదాచుకున్న సుబ్బారావుపై బాలినేని అనుచరుడు సుభానీ తన గ్యాంగ్‌తో పాటు వెళ్లి దాడి చేశాడు. మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి వీడియో తీశారు. గుప్తాపై సుభానీ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొంత పార్టీ నేతపై మంత్రి అనుచరులు దాడి చేయడం సంచలనంగా మారింది.

Updated Date - 2021-12-20T22:14:53+05:30 IST