షర్మిలమ్మ.. మేమంతా ఒకటే..: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2022-01-05T23:20:21+05:30 IST

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

షర్మిలమ్మ.. మేమంతా ఒకటే..: మంత్రి బాలినేని

ప్రకాశం: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారని,  కానీ ఏపీలో పార్టీ పెడతామని చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. షర్మిల ఏపీలో పార్టీ పెడతారని కొందరు అభూత కల్పనలు చేస్తున్నారన్నారు. షర్మిలమ్మతో పాటు తామంతా వైఎస్సాఆర్‌ కుటుంబమని, మేమంతా ఒకటేనని ఆయన స్పష్టం చేశారు.


చంద్రబాబు చేసిన విద్యుత్ బకాయిలు కూడా ఇప్పుడు తీరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పోలవరంలో ఏమి చేసారో అందరికీ తెలుసన్నారు. రాజధానికి ఆయన చేసిందేమీ లేదని, అందుకే ఓడిపోయారన్నారు. చంద్రబాబులా జగన్ ఎవరిని యాచించే వ్యక్తి కాదన్నారు. రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకుంటాడన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చుట్టూ తిరిగాడని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టినామని ఎన్టీఆర్ చెబితే అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో జగన్  కలిస్తే కేసులు మాఫీ చేసేవారన్నారు. కానీ కేంద్రంలో ఉన్న సోనియాను కూడా జగన్ ఎదిరించి పార్టీ పెట్టారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-05T23:20:21+05:30 IST