ముంబైలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి భగవత్‌ కృష్ణారావు

ABN , First Publish Date - 2021-10-22T09:04:40+05:30 IST

ముంబైలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావు కరద్‌ ఈ నెల 18న సందర్శించారు.

ముంబైలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి భగవత్‌ కృష్ణారావు

ముంబైలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావు కరద్‌ ఈ నెల 18న సందర్శించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలందించటంతో పాటు వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే దానిపై ఎల్‌ఐసీ ప్రధానంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి  సూచించారు. అంతర్జాతీయ ఇన్సూరెన్స్‌ బ్రాండ్లలో ఎల్‌ఐసీ స్థానం దక్కించుకోవటం పట్ల కరద్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కరద్‌తో పాటు ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు సిద్ధార్థ మొహంతీ, మినీ ఇపే, బీసీ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T09:04:40+05:30 IST