ఆలయ నిర్మాణానికి మంత్రి భూమిపూజ
ABN , First Publish Date - 2020-08-15T10:58:06+05:30 IST
మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ముప్కాల్, ఆగస్టు 14: మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.34లక్షల నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నా రు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ, జడ్పీ టీసీ బద్దం నర్సవ్వ, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు ముస్కు భూమేశ్వర్, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సామ వెంకట్రెడ్డి, బద్దం నర్సారెడ్డి, ముత్తెన్న, గు రడికాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.