జిల్లా యంత్రాంగానికి.. మంత్రి బోస్ రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2020-03-27T10:26:35+05:30 IST
కోవిడ్-19 వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు ఎంతో
కాకినాడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కోవిడ్-19 వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు ఎంతో అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్కు వచ్చిన ఆయన కలెక్టర్ మురళీధర్రెడ్డిని కలిసి సహాయక కార్యక్రమాలకోసం రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించి వైరస్ నిరోధానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.