చంద్రబాబు చెప్పిందే వినాలా..?: బొత్స

ABN , First Publish Date - 2021-12-08T20:24:19+05:30 IST

సామాన్యుడు సొంత ఇల్లు కావాలని అనుకోవడం తప్పా? అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చెప్పిందే వినాలా..?: బొత్స

అమరావతి: సామాన్యుడు సొంత ఇల్లు కావాలని అనుకోవడం తప్పా? సొంత ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం అనుకోవడం తప్పా? చంద్రబాబు చెప్పిందే వినాలా..? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వక్ర బుద్ది.. పచ్చ చూపు తెలుసునన్నారు. ఏ నాడైనా ప్రభుత్వం పలానా పథకం బాగుంది అని పోగిడారా? అని నిలదీశారు. జవసత్వాలు లేకుండా పడిపోయిన చంద్రబాబుని నిలబెట్టాలని చూస్తున్నారని, కానీ జనం నిజాయితీగా ఉన్నారన్నారు. వాళ్ళ కోసం పని చేసిన వారికి అండగా ఉంటారన్నారు. నమ్మకంగా ఉండే నాయకుడికే జనం పట్టం కడతారన్నారు. చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అన్ని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని తాపత్రయ పడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-08T20:24:19+05:30 IST