నిమ్మగడ్డ విషయంలో టీడీపీ జోక్యమా? : బొత్స
ABN , First Publish Date - 2020-06-01T09:22:32+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తన పదవిని కోల్పోయినందుకు కోర్టును ఆశ్రయించడంలో తప్పేమీ లేదని, కానీ తెలుగుదేశం ..
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తన పదవిని కోల్పోయినందుకు కోర్టును ఆశ్రయించడంలో తప్పేమీ లేదని, కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు కోర్టుకు వెళ్లిందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీకి కుయుక్తులే ముఖ్యమని, వ్యవస్థలు కాదన్నారు. తాము ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, టీడీపీకి ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో 90 శాతం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారని అన్నారు.