వరసిద్ధుడి సేవలో మంత్రి బొత్స
ABN , First Publish Date - 2021-08-04T06:27:56+05:30 IST
మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాణిపాక వరసిద్ధుడిని మంగళవారం దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 3: మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాణిపాక వరసిద్ధుడిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేశు, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఎమ్మెస్బాబు, ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్రెడ్డి, చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ విశ్వనాథ్, మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తంరెడ్డి, పరమేశ్వర్రెడ్డి, ఏఈవో విద్యాసాగర్రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్లు రమేష్, కిషోర్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.