చట్టం ఆమోదించిన రోజే మూడు రాజధానులు

ABN , First Publish Date - 2021-08-04T00:19:11+05:30 IST

రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టత

చట్టం ఆమోదించిన రోజే మూడు రాజధానులు

తిరుపతి: రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. రాజధాని చట్టం ఆమోదించిన రోజే మూడు రాజధానులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామన్నారు. విశాఖ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయనివ్వబోమన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్నుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స విమర్శించారు. తిరుపతిలో వేగంగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయని మంత్రి బొత్స తెలిపారు. 

Updated Date - 2021-08-04T00:19:11+05:30 IST