మేకప్ వేసుకునేవాళ్లు మాకు చెప్పడమేంటి?
ABN , First Publish Date - 2021-03-08T10:06:14+05:30 IST
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను 28 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్కల్యాణ్
ఉక్కు పరిరక్షణ ఎలాగో వైసీపీకి తెలుసు: బొత్స
విశాఖపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను 28 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్కల్యాణ్ విడుదల చేసిన వీడియోపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ‘స్టీల్ప్లాంట్ను రక్షించుకోవడానికి ఏం చేయాలో మాకు తెలుసు. అసలు నీ స్టాండ్ ఏమిటి? నువ్వు దీనిపై ప్రధాని మోదీని ప్రశ్నించావా? మేకప్ వేసుకుని వచ్చి మాకు సుద్దులు చెప్పొద్దు. మేము మేక్పలు వేసుకునేవాళ్లం కాదు. ప్రజల నుంచి వచ్చిన నాయకులమనే విషయాన్ని గుర్తుంచుకో’ అని పరోక్షంగా పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్పై విసుర్లు విసిరారు. ‘విశాఖను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. విశాఖ అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగింది.. దీనిపై తాను చర్చకు సిద్ధం. రాజకీయంగా ఎదగాల్సిన లోకేశ్ ఒక శుంఠ అని, ఆయన భాష సగటు మనిషి తలదించుకునేలా ఉంది’ అని ఎద్దేవా చేశారు.