గుంటూరులో జింధాల్ కంపెనీ ప్రాజెక్ట్ను పరిశీలించిన మంత్రి బొత్స
ABN , First Publish Date - 2021-06-17T15:05:31+05:30 IST
జిల్లా శివారు ఓబులనాయుడు పాలెం వద్ద జింధాల్ కంపెనీ ప్రాజెక్ట్ను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.
గుంటూరు: జిల్లా శివారు ఓబులనాయుడు పాలెం వద్ద జింధాల్ కంపెనీ ప్రాజెక్ట్ను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వచ్చే చెత్తతో జింధాల్ ప్రాజెక్టు పవర్ తయారు చేయనుంది. ప్రాజెక్ట్ నిర్వహణపై కంపెనీ ప్రతినిధులతో మంత్రి బొత్స సమీక్ష జరిపారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వివేక్ యాదవ్, కమిషనర్ అనురాధ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.