సిగ్నల్ లేదని 50 అడుగుల ఎత్తులో.. ఉయ్యాల కట్టుకొని కూర్చుంటున్న మంత్రి!

ABN , First Publish Date - 2021-02-22T09:38:33+05:30 IST

మొబైల్ నెట్‌వర్క్ సరిగా రావడం లేదని ఓ మంత్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారో తెలుసా? ఓ 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల కట్టుకొని దానిలో కూర్చొని పని చేశారు.

సిగ్నల్ లేదని 50 అడుగుల ఎత్తులో.. ఉయ్యాల కట్టుకొని కూర్చుంటున్న మంత్రి!

భోపాల్: మొబైల్ నెట్‌వర్క్ సరిగా రావడం లేదని ఓ మంత్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారో తెలుసా? ఓ 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల కట్టుకొని దానిలో కూర్చొని పని చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇక్కడి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ మొబైల్‌కు నెట్‌వర్క్ సరిగా రాలేదు. దీంతో ఆయన ఓ 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల ఏర్పాటు చేసుకున్నారు. ఆంఖో గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఉయ్యాల ఎక్కి ఆయన పని చేయడం ఇది తొలిసారేమీ కాదు. గత తొమ్మది రోజులుగా ఆయన ఇదే పని చేస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 3 గంటలపాటు ఉయ్యాల్లో కూర్చొని పని చేసి తిరిగి వెళ్తున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-02-22T09:38:33+05:30 IST