అల్ల‌ర్లతో భైంసా అభివృద్ధి కుంటుప‌డుతోంది

ABN , First Publish Date - 2021-03-13T21:32:54+05:30 IST

అల్లర్ల కారణంగా భైంసా అభివృద్ధి కుంటుప‌డుతోందిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అల్ల‌ర్లతో భైంసా అభివృద్ధి కుంటుప‌డుతోంది

నిర్మల్: అల్లర్ల కారణంగా భైంసా అభివృద్ధి కుంటుప‌డుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భైంసాలో అల్లర్లు జరిగిన కాలనీల్లో ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. అల్ల‌ర్ల కారణంగా నష్టపోయిన బాధితుల‌ను మంత్రి ప‌రామ‌ర్శిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న వ‌రుస ఘ‌ట‌న‌లతో రెండు వ‌ర్గాల వాళ్ళు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అల్ల‌ర్లు జరుగడానికి బాధ్యులైనా వారు ఎంత‌టి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అల్ల‌ర్ల వెనుక ఏ పార్టీ హ‌స్తం ఉందో అంద‌రికీ తెలుసని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. 

Read more