రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోంది: మంత్రి ధర్మాన
ABN , First Publish Date - 2021-07-17T02:39:58+05:30 IST
రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్
తూర్పు గోదావరి: రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలోని జగ్గంపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. జగ్గంపేట, గండేపల్లి రెవిన్యూ కార్యాలయాలను ధర్మాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోందన్నారు. వివాద రహితంగా సర్వే నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.