తన పేషీ సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-06-03T23:17:32+05:30 IST
రాష్ట్రపంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు తన పేషీలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు
హైదరాబాద్: రాష్ట్రపంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు తన పేషీలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా తన నియోజక వర్గం పరిధిలో నిరుపేదలకు వివిధ రకాల సాయం అందిస్తున్నా మంత్రి తాజాగా ఖైరాబాద్లోని రంగారెడ్డి జిల్లాకలెక్టరేట్ భవనంలో ఉన్న తన పేషీలో పనిచేస్తున్న చిరుద్యోగులు, ఇతర వర్కర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునే సేవా నిరతి ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ఎవరికి వారు తమ శక్తిమేరకు ఇతరులకు సాయం అందించాలన్నారు. కరోనా వైరస్ మిగిల్చిన అనేక సమస్యల్లో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు మన రాష్ర్టాన్ని, ప్రజలను భద్రంగా ఉంచాయన్నారు. కష్టకాలంలో పేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సాయంచేస్తున్నా దాతలు కూడా ముందుకు వచ్చి సాయం అందించాలన్నారు.