స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుడు శ్రీకాంతచారి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-12-03T19:52:53+05:30 IST

మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి అని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుడు శ్రీకాంతచారి- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి అని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయన మా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోయాడు. అతి చిన్న వయస్సులో స్వరాష్ట్రం కోసం అమరుడు కావడం బాధాకరమని అన్నారు. శ్రీకాంత చారి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శ్రీకాంత చారి త్యాగాన్ని గుర్తించి ఆయన తమ్ముడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించామని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్నిసాధించుకున్నామని చెప్పారు. 

Updated Date - 2020-12-03T19:52:53+05:30 IST