తొర్రూరు ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా-మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-01-27T22:08:04+05:30 IST

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ మున్సిపాలిటీ ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

తొర్రూరు ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా-మంత్రి ఎర్రబెల్లి

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ మున్సిపాలిటీ ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్ని కోట్లు అయినా వెచ్చించడానికి వెనుకాడని స్పష్టం చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు సుధాకర్ రావు సహకారంతో యతి రాజారావు పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.


పట్టణ అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయిస్తానని అన్నారని తెలిపారు. బుధవారం తొర్రూరు రైతు సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే పల్లె ప్రకృతి వనం, తొర్రూర్ లోని అన్నారం షరీఫ్ క్రాస్రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ని, ఇక్కడి నుంచి నేరుగా ర్యాలీగా కాలి నడకన వెళ్లి యతిరాజరావు పార్క్ లో ఓపెన్ జిమ్ ని కూడా మంత్రి ప్రారంభించారు.


అనంతరం ఆయన మాటాడుతూ మార్చి తర్వాత కౌన్సిలర్ లకు వార్డు ల అభివృద్ధి కోసం ఒక్కో వార్డుకు యాభై లక్షలు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అభివృద్ధి చేయకపోయినా, నేనున్నాననే భావన కలిగించాలి అన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రైతాంగం సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాలువల ద్వారా వ్యవసాయ సేద్యానికి నీరు అందిస్తున్నామన్నారు. రూ. 45 వేల కోట్లు వెచ్చించి సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చామని తెలిపారు.




మిగతా మినరల్ వాటర్ కంటే, మిషన్ భగీరథ బాటిల్ వాటర్ ఎంతో ఆరోగ్యదాయకం అని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ మినరల్ బాటిల్ వాటర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, ఎంపీపీ అంజయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్, గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, తాసిల్దార్ రాఘవ రెడ్డి, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T22:08:04+05:30 IST