చీమలవారిగూడెం...పేరే పల్లి రోడ్డుపనులకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-10-08T19:59:06+05:30 IST

సింగరేణి మండలం చీమల వారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు మరియు బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు

చీమలవారిగూడెం...పేరే పల్లి రోడ్డుపనులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: సింగరేణి మండలం చీమల వారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు మరియు బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు. తెలంగాణ శాసన సభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.సింగరేణి మండలం చీమల వారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు మరియు బ్రిడ్జి కోసం 4 కి. మీ. బీటీ రోడ్డు తో పాటు 12 సిడి పనులను 5 కోట్లతో సంబధిత అధికారులు అంచనా వేశారన్నారు. ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Updated Date - 2021-10-08T19:59:06+05:30 IST