పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు
ABN , First Publish Date - 2021-10-26T01:37:19+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో సీఎం కేసిఆర్ 9వసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన నేపద్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో సీఎం కేసిఆర్ 9వసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన నేపద్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపాురు. కేసీఆర్ పార్టీ అధినేతగా ఎన్నుకున్న పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన అన్ని విభాగాల కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ నుంచి భారీగా తరలి వచ్చిన పార్టీ డెలిగేట్లు, నేతలకు సైతం మంత్రతి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.కాగా సీఎం కేసిఆర్ గారిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్న రాష్ట్ర వ్యాప్త పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు పార్లమెంట్ సభ్యుడు, ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యుడు జి. రంజిత్ రెడ్డి సైతం ధన్యవాదాలు తెలిపారు.