చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి: మంత్రి ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-11-03T23:19:50+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం,కేదారీశ్వర వ్రతాలు చేయడం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్రజలందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొవాలని ఆయన సూచించారు.